హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు సంబంధించిన పరీక్ష ఫలితాలను, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను టీఎస్పీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. లెక్చరర్ పోస్టులకు 2022 జులైలో నోటిఫికేషన్ ఇవ్వగా, 2023 సెప్టెంబర్లో ఎగ్జామ్ నిర్వహించింది. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను రిలీజ్ చేసినట్టు టీఎస్పీఎస్సీ పేర్కొంది.
ర్యాంకింగ్ లిస్ట్ను వెబ్సైట్లో పెట్టామంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పింది. అర్హత సాధించని అభ్యర్థుల పేర్లను ర్యాంకింగ్ జాబితాలో చేర్చలేదని స్పష్టం చేసింది.