నార్సింగిలో చెత్త ఊడ్చిన పొంగులేటి

నార్సింగిలో చెత్త ఊడ్చిన  పొంగులేటి

హైదరాబాద్, వెలుగు:  ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ నేత, తమిళనాడు కో ఇన్ చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నార్సింగిలోని హనుమాన్ టెంపుల్ పరిసరాల్లో మున్సిపల్ సిబ్బందితో కలిసి చెత్తను ఊడుస్తూ పరిసరాలను క్లీన్ చేశారు.

అనంతరం కోకాపేటలోని రాజపుష్ప అపార్ట్ మెంట్స్ పరిసరాల్లో స్థానికులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో నార్సింగ్ మున్సిపల్ కౌన్సిలర్ ఆదిత్య రెడ్డితో పాటు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, రాజపుష్ప అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.