14న పొంగులేటి కీలక ప్రకటన..కాంగ్రెస్ లో చేరికపై క్లారిటీ

14న పొంగులేటి  కీలక ప్రకటన..కాంగ్రెస్ లో చేరికపై క్లారిటీ
  •  హైదరాబాద్ లో ప్రెస్ మీట్
  •  కాంగ్రెస్ లో చేరికపై క్లారిటీ
  • ముహూర్తం ఫిక్స్ చేసుకున్న ఖమ్మం మాజీ ఎంపీ

హైదరాబాద్: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 14న కీలక ప్రకటన చేయనున్నారు. కాంగ్రెస్ లో చేరికపై క్లారిటీ ఇవ్వనున్నారు. రెండు రోజుల క్రితం బెంగళూరు వెళ్లిన పొంగులేటి కర్నాటక పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత తేదీ ఖరారు చేసుకున్నట్టు సమాచారం. జూన్ 14 ఏకాదశి తిథి ఉదయం 10.30 గంటల వరకు ఉన్నదని, ఆ సమయంలోపు విషయాన్ని రివిల్ చేయాలని వేద పండితులు పొంగులేటికి సూచించినట్టు సమాచారం. ఈ మేరకు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి తన చేరికను అధికారికంగా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.