హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్లో చేరితే సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని సీనియర్ లీడర్ పొన్నాల లక్ష్మయ్యకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్కు చేరుకున్న పొన్నాల లక్ష్మయ్య దంపతులను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు.
ఇద్దరి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్లో చేరాలని ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్యను కేసీఆర్ కోరారు. తగిన గుర్తింపు ఇస్తామని సూచించారు. దీనికి పొన్నాల లక్ష్మయ్య కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.