నన్ను గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటా : పొన్నం ప్రభాకర్​

నన్ను గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటా :  పొన్నం ప్రభాకర్​

సైదాపూర్, వెలుగు:  తన విజయంలో అండగా నిలిచిన ప్రతిఒక్క కార్యకర్త, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి, అండగా ఉంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. శుక్రవారం సైదాపూర్​మండలకేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు విజయం చేకూర్చిన హుస్నాబాద్​ ప్రజలకు కష్టసుఖాల్లో అందుబాటులో ఉంటానన్నారు.

అనంతరం నియోజవర్గంలోని ప్రజా సమస్యలపై కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలు ప్రజలకు చేరువలో ఉండి ప్రభుత్వం పథకాలు చేరువయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్​మండల అధ్యక్షుడు దొంత సుధాకర్​, లీడర్లు ఊసకోయిల రాఘవులు, రవీందర్​ రావు పాల్గొన్నారు.