Allu Arjun, Pooja Hegde: ముచ్చటగా మూడోసారి.. క్రేజీ ప్రాజెక్టులో బంపర్ ఆఫర్

Allu Arjun, Pooja Hegde: ముచ్చటగా మూడోసారి.. క్రేజీ ప్రాజెక్టులో బంపర్ ఆఫర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ కు ఓకే చెప్పేస్తున్నారు. ఇప్పటికే సుకుమార్(Sukumar) డైరెక్షన్ లో పుష్ప2(Pushpa2) చేస్తున్న ఆయన.. మరో రెండు భారీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. అందులో దర్శకుడు త్రివిక్రమ్(Trivikram) తో చేస్తున్న సినిమా ఒకటికాగా.. మరొకటి తమిళ దర్శకుడు అట్లీ కుమార్(Atlee kumar) తో చేయబోయే ప్రాజెక్టు ఉంది. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. 

మరీ ముఖ్యంగా అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొంటున్నాయి. కారణం దర్శకుడు అట్లీ ఈ మధ్యే షారుఖ్ ఖాన్ తో జవాన్ చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ కూడా నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఇక త్వరలో రానున్న పుష్ప2 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకునే ఛాన్స్ గట్టిగా కనిపిస్తోంది. అందుకే అల్లు అర్జున్, అట్లీ కుమార్ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అవుతోంది. 

ఇదిలా ఉంటే.. ఈ ప్రాజెక్టు కు సంబంధించని న్యూస్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే(Pooja Hegde)ని ఫిక్స్ చేశారట మేకర్స్. ఇప్పటికే ఈ బ్యూటీ అల్లు అర్జున్ తో DJ(దువ్వాడ జగన్నాధం), అలా వైకుంఠపురంలో వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బన్నీతో జతకట్టబోతోంది పూజ. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. మరి బ్లాక్ బస్టర్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.