రెండు సినిమాలు పోయాయి.. మూడు సినిమాలు వచ్చాయి

రెండు సినిమాలు పోయాయి.. మూడు సినిమాలు వచ్చాయి

మొన్నటివరకు టాలీవుడ్ ఎక్కడ విన్నా పూజ హెగ్డే(Pooaja hegde) పేరే వినిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగులో ఈ బ్యూటీ చివరగా ఆచార్య సినిమాలో కనిపించింది. ఈ సినిమా తరువాత పూజ నుండి ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. 

పైగా ఆల్రెడీ ఓకే ఐన సినిమాల నుండి కూడా ఈ అమ్మడును తీసేశారు. మహేష్ బాబు(Mahesh babu), త్రివిక్రమ్(Trivikram) కాంబోలో వస్తున్న సినిమా నుండి పూజను తీసేశారని వార్తలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఆమె స్థానంలో మానాక్షి చౌదరి(Meenakshi choudary)ని కూడా తీసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్(Pawan kalyan), హరీష్ శంకర్(Harish shankar) కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad bhagath singh) నుండి కూడా పూజను తొలగించినట్టు సమాచారం.

అయితే ఈ రెండు సినిమాల నుండి బయటకు వచ్చేసినా.. ఈ గ్యాప్ లోనే మరో మూడు సినిమాలకు సైన్ చేసింది ఈ బ్యూటీ. అందులో మాస్ మహారాజ్ రవితేజ(Raviteja), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand malineni) కాంబోలో వస్తున్న సినిమా ఒకటి కాగా, సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) హీరోగా సంపత్ నంది(Sampath nandi) చేస్తున్న సినిమాలో కూడా పూజానే హీరోయిన్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తమిళ స్టార్ హీరో కార్తీ(Karthi) హీరోగా వస్తున్న ఆవారా(Avaara) సీక్వెల్ లో కూడా ఈ బ్యూటీనే తీసుకోనున్నాడట దర్శకుడు లింగుస్వామి(Linguswamy). ఒకప్ప భారీ సినిమాల అవకాశాలు చెయ్ జారినా.. మీడియం రేంజ్ హీరోలకు ఫస్ట్ ఆప్షన్ గా మారింది పూజ. మరో ఈ మూడు సినిమాలి పూజకు ఎలాంటి రిజల్ట్ ను ఇవ్వనున్నాయి అనేది చూడాలి.