ప్రియాంక రెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి

ప్రియాంక రెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి

వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంక రెడ్డి మృతదేహానికి షాద్‌నగర్లో పోస్ట్‌మార్టం పూర్తి అయ్యింది. కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని పోలీసులు అప్పగించారు. నిందితుల కోసం 15 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. మరో వైపు .. ప్రియాంక రెడ్డి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

పంచర్‌ షాప్‌ దగ్గర ఉన్న కెమెరా ఫూటేజ్‌ను పరిశీలించామన్నారు డీసీసీ ప్రకాశ్ రెడ్డి. ఇద్దరు వ్యక్తులు ప్రియాంకను కారులో కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ప్రియాంక రెడ్డి స్కూటీ టైర్‌ ను కావాలనే ఎవరో పంచర్‌ చేసినట్లు తెలిపారు. చివరిసారిగా లారీ డ్రైవర్లు చుట్టుముట్టారని ఏడుస్తూ ప్రియాంక ఫోన్లో మాట్లాడిందని.. లారీ డ్రైవర్ల కారణంగానే తమ కూతురు చనిపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.