జపాన్‌‌ ఫ్యాన్స్‌‌ ప్రేమకు ఫిదా అయ్యానంటున్న ప్రభాస్..

జపాన్‌‌ ఫ్యాన్స్‌‌ ప్రేమకు ఫిదా అయ్యానంటున్న ప్రభాస్..

‘బాహుబలి’ రెండు భాగాలను కలిపి ఇటీవల ‘బాహుబలి ది ఎపిక్‌‌’ పేరుతో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమా జపాన్‌‌లోనూ రిలీజ్ కాబోతోంది. ఈనెల 12న అక్కడ విడుదలవుతున్న నేపథ్యంలో ప్రభాస్‌‌ స్పెషల్‌‌ స్క్రీనింగ్‌‌కు హాజరయ్యారు. అక్కడి అభిమానుల ప్రేమకు ఫిదా అయిన ప్రభాస్‌‌.. ప్రత్యేకంగా వాళ్లతో ముచ్చటించారు.  ప్రభాస్‌‌ మాట్లాడుతూ ‘ఎంతో ఎమోషనల్‌‌గా ఉంది. గత పదేళ్లుగా ఈ మూమెంట్‌‌ కోసం ఎదురుచూస్తున్నా. రాజమౌళి గారి ఫ్యామిలీ, శోబు గారి ఫ్యామిలీ ఇక్కడి ప్రేక్షకుల లవ్‌‌, ఎమోషన్‌‌ గురించి చెప్పారు. ఇప్పుడు  జపాన్‌‌ మా అందరికీ సొంత దేశంలా మారింది. 

మీ ఆదరణకు థ్యాంక్స్‌‌. ఎన్నో ఏళ్ల తర్వాత మిమ్మల్నందరినీ ఇలా డైరెక్ట్‌‌గా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను’ అని చెప్పారు. ఇక ప్రస్తుతం  ది రాజాసాబ్, ఫౌజి, స్పిరిట్ సినిమాల షూటింగ్స్‌‌తో ప్రభాస్‌‌ బిజీగా ఉన్నారు. సలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం,  కల్కి 2898 ఏడీ పార్ట్ 2 సినిమాలు చేయాల్సి ఉంది.