ప్రభాస్ స్పిరిట్ నుంచి.. మత్తెక్కించే స్టోరీ వైరల్!

ప్రభాస్ స్పిరిట్ నుంచి.. మత్తెక్కించే స్టోరీ వైరల్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికీ షూటింగ్ దశలో ఉన్న కల్కి మూవీతో పాటు మారుతి డైరెక్షన్ లో ఒకటి, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా స్పిరిట్ మూవీ నుంచి చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. స్పిరిట్ మూవీ అర్జున్ రెడ్డిలో చూపించిన డ్రగ్స్ కంటే 90% పవర్ ఫుల్ డ్రగ్స్ మాఫియా ఉండనుందని సమాచారం. అలాగే స్పిరిట్లో చాలా స్పెషల్ డ్రగ్స్..అంటే, భీకరమైన మత్తెక్కించే క్వాలిటీ డ్రగ్ తీసుకుంటే ఏ రేంజ్లో ఉంటుందో..ఇందులో చూపించబోతున్నట్లు తెలుస్తుంది.

ALSOREAD:మెగా మాస్157 అప్డేట్.. గెట్ రెడీ ఫ్యాన్స్

స్పిరిట్ మూవీ థియేటర్స్లో ఆడియన్స్కి చాలా మత్తెక్కిస్తుందని..ప్రభాస్ ఇందులో టూ డిఫరెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్కు సరైన మాస్ ఎలివేషన్ పడితే ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే అంటున్నారు సినీ క్రిటిక్స్. దీంతో సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్స్ని రెడీ చేశాడని సమాచారం.

ఈ న్యూస్ తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ను మాస్ గా చూస్తామో..క్లాస్ గా చూస్తామో..లేక డెంజరస్ డెవిల్ గా చూస్తామో అనే క్యూరియాసిటీలో ఉన్నట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ తెలుపుతున్నారు. ప్రసెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో యాక్షన్,థ్రిల్లర్ గా యానిమల్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తర్వాత స్పిరిట్ మూవీ ప్రాజెక్ట్ పై వర్క్ చేసే అవకాశం ఉంది.