
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన బాహుబలి(Bahubali) ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో బాహుబలి పాత్రకు సంబంధించిన మైనపు విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచిన విషయం కూడా తెలిసిందే. ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది.
రీసెంట్గా మైసూర్ మ్యూజియం(Mysore Museum)లో ప్రభాస్ మైనపు విగ్రహం చర్చనీయాంశం అయ్యింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మైసూర్ మ్యూజియంలో ప్రభాస్ బాహుబలి పాత్రకు సంబంధించిన మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు. ఆ బొమ్మను చూసి నెటిజన్స్ మాత్రం..ఫుల్లుగా నవ్వుకుంటున్నారు.అలాగే బాహుబలి మూవీ ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ(Shobu Yarlagadda) సైతం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు తమ అనుమతి లేకుండా మ్యూజియంలో ఇలాంటి విగ్రహాలు ఎలా పెడతారని మండిపడ్డారు.
లేటెస్ట్గా మైసూర్ మ్యూజియం అధినేత ఓ ప్రముఖ దినపత్రిక ద్వారా..ఈ ఇష్యుపై స్పందించారు. 'ఎవరి మనో భావాలు దెబ్బతీయాలని అలా చేయలేదు. ఇక నెటిజన్స్ నుంచి..బాహుబలి ప్రొడ్యూసర్స్ నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వస్తుండటంతో..మ్యూజియం నుంచి ప్రభాస్ విగ్రహాన్ని తొలగిస్తామని' వెల్లడించారు. దీంతో సోషల్ మీడియా ట్రోల్స్కి బ్రేక్ పడింది. ఇక ఫ్యూచర్లో ఎవరైనా అమరేంద్ర బాహుబలి విగ్రహం..మ్యూజియంలో ఏర్పాటు చేయాలంటే..ముందుగా నిర్మాతల అనుమతి తీసుకోవాలి అని అర్ధమైంది.
ఈ మైనపు విగ్రహం కొంచం కూడా ప్రభాస్లా లేకపోవడం,చూడటానికి కూడా అదోలా ఉండటంతో నెటిజన్స్ ఫుల్లుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే..ఈ మైనపు విగ్రహం ఏర్పాటు పై ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ను ఏంట్రా ఇలా తయారు చేశారు అంటూ ఫైర్ అవుతున్నారు. రామ్ చరణ్ పోలిక అంటూ..క్రికెటర్ వార్నర్ లా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో మ్యూజియం నిర్వాహకులు ప్రభాస్ విగ్రహాన్నివెంటనే తొలగించాలని నిర్ణయించుకున్నారు.
This not an officially licensed work and was done without our permission or knowledge. We will be taking immediate steps to get this removed. https://t.co/1SDRXdgdpi
— Shobu Yarlagadda (@Shobu_) September 25, 2023