‘ఉప్పెన’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే స్టార్ డమ్తో పాటు వరుస అవకాశాలు దక్కించుకుంది కృతి శెట్టి. అలాగే తమిళంలోనూ గుర్తింపును అందుకున్న కృతి.. అక్కడ కూడా బ్యాక్ టు బ్యాక్ చాన్సులు అందుకుంటోంది. ఇప్పటికే చేతిలో ఓ తెలుగు సినిమా, రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. తాజాగా మరో కోలీవుడ్ ప్రాజెక్టు లోకి అడుగుపెట్టింది. ‘లవ్ టుడే’తో సూపర్ హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథ్కు జోడీగా నటించనుంది కృతి శెట్టి. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభిం చారు.
దీనికి ‘ఎల్ఐసీ ; లవ్ ఇన్సూరె న్స్ కార్పొరేషన్’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. సెవెన్ స్ర్కీన్ స్టూడియోతో పాటు విఘ్నేష్ శివన్ సొంత బ్యానర్ రౌడీ పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తు న్నాయి. ఎస్ జే సూర్య, యోగి బాబు ఇతర పాత్రలు పోషిస్తున్నా రు. అనిరుధ్ సంగీతం అందిస్తు న్నాడు. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.