నాతో కలిసి పోటీ చేస్తే కేసీఆర్ ను ఎవరూ ఓడించలేరు : కేఏ పాల్

నాతో కలిసి పోటీ చేస్తే కేసీఆర్ ను ఎవరూ ఓడించలేరు : కేఏ పాల్

నాతో కలిసి పోటీ చేస్తే కేసీఆర్ ను ఎవరూ ఓడించలేరు 
రెడ్లందరూ ఆయన్ను ఓడించాలని చూస్తున్నరు 
ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్

హైదరాబాద్ : రెడ్లందరూ కలిసి కేసీఆర్ ను ఓడించాలని చూస్తున్నారని, తనతో  కలిసి పోటీ చేస్తే ఆయనను ఎవరూ ఓడించలేరని  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీడిమెట్ల సూపర్ మ్యాక్స్ బ్లేడ్ కంపెనీ దగ్గర రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఫ్యాక్టరీ కార్మికులకు శనివారం (జూన్ 10న)  కేఏ పాల్ మద్దతు తెలిపారు.

‘పొద్దున్నే సూపర్ మ్యాక్స్ బ్లేడ్ వాడాను. బాగా ఉంటుంది. వారం రోజుల్లో మీ సమస్య పరిష్కారం అవుతుంది. మీ సమస్య పరిష్కారం చేస్తాను. నాకు మీరు ఓటువేయాలి. మీ అందరినీ కేసీఆర్ కు కలిపించి మీ సమస్య పరిష్కారం చేస్తాను. గతంలో ప్రజల పక్షాన పోరాటం చేసిన ప్రతి ఉద్యమం గెలిచాను. ఇది కూడా గెలుస్తాము’  అని పాల్ భరోసా ఇచ్చారు.