ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

91 వేల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల

విజయవాడ: భారీ వర్షాలకు కృష్ణా నదిలో వరద క్రమంగా పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం డ్యామ్ నుండి పెద్దగా వరద రాకున్నా.. స్థానిక వర్షాలకు కృష్ణా నదిలో వరద పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద పోటెత్తడంతో మొత్తం 70 గేట్లు అడుగు మేర ఎత్తి వరద నీరు సముద్రం లోనికి విడుదల చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ప్రకాశం బ్యారేజ్ కి ఇన్ ఫ్లో లక్షా పదివేల క్యూసెక్కులు నమోదు అయింది. గేట్ల ద్వారా 91 వేల కుసెక్కులు విడుదల చేస్తున్నారు. వర్షాలకు పెరుగుతున్న వరద ప్రవాహానికి అనుగుణంగా గేట్లు ఎత్తుతూ నీటి విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు.