న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయనను పార్టీలో చేరాలని హైకమాండ్ అడిగినట్లు సమాచారం. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఇంట్లో పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. దీనికి ప్రశాంత్ కిశోర్ హాజరయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన ప్రజంటేషన్ ఇచ్చారు. ‘‘ప్రశాంత్ కిశోర్ను ఎన్నికల వ్యూహకర్తగా కాకుండా, పార్టీలో చేరి లీడర్ గా పని చేయాలని హైకమాండ్ కోరింది. త్వరలోనే ఆయన కాంగ్రెస్లో చేరొచ్చు” అని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. కాగా, ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీలో చేయాల్సిన మార్పులపై పీకే ప్రజంటేషన్ ఇచ్చారు. ఇప్పటికే పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాలపై మరింత ఫోకస్ పెట్టాలని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 370 సీట్లు లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన సూచించారు. ‘‘వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రశాంత్ కిశోర్ ప్రజంటేషన్ ఇచ్చారు. వాటిపై చర్చించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించాం. ఆ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారనేది సోనియా గాంధీ నిర్ణయిస్తారు” అని పార్టీ సీనియర్ లీడర్ కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖార్గే, అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్, అజయ్ మాకేన్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ లో చేరాలని పీకేను కోరిన హైకమాండ్
- దేశం
- April 17, 2022
లేటెస్ట్
- IPL 2024: వార్నర్, స్టబ్స్ పోరాటం వృధా.. ఢిల్లీపై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ
- గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Samantha: సిటాడెల్ కోసం కఠినమైన శిక్షణ తీసుకున్న:సమంత
- Suriya 44 Movie: క్రేజీ కాంబో..కార్తీక్ సుబ్బరాజుతో సూర్య కొత్త సినిమా షురూ
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్
- IPL 2024: ఒక్కడే వారియర్లా: పరాగ్ ఒంటరి పోరాటంతో రాజస్థాన్ భారీ స్కోర్
- ఫస్ట్ టైం.. అదాని పవర్ ప్రాజెక్టుల్లో రిలయన్స్ 26 శాతం వాటా
- గూగుల్లో జాబ్స్ ఈ అర్హతలు ఉన్నవారికే
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఫోన్ ట్యాపింగ్ వెనుక ఓ ఎంపీ .. విచారణలో గుర్తించిన పోలీసులు!
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- SRH vs MI: ముంబై కెప్టెన్గా రోహిత్.. హార్దిక్ను ఏమన్నాడంటే..?
- Good Health : ధ్యానం అంటే ఏంటీ.. ఎలా చేయాలి.. ఉపయోగాలు ఏంటీ..!