
సంతోష్ శోభన్, రాశీ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ ‘ప్రేమ్ కుమార్’. నటుడు, రచయిత అభిషేక్ మహర్షి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శివ ప్రసాద్ పన్నీరు నిర్మాత. ఆగస్టు 18న సినిమా విడుదలవుతోంది. శనివారం ఈ మూవీ పరిచయ వేదిక కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది.ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ ‘అభిషేక్ మహర్షి మంచి హ్యూమర్ ఉన్న డైరెక్టర్. కామెడీ సినిమా చేయటం మామూలు విషయం కాదు.. కానీ తను గొప్పగా తీశాడు. ఈ సినిమా రెండు గంటలపాటు ప్రేక్షకులను మనస్ఫూర్తిగా నవ్వుకునేలా చేస్తుంది’ అన్నాడు.
ఇందులో నేత్ర అనే అమ్మాయిగా కనిపిస్తా అంది రాశీ సింగ్. అంగన పాత్ర పోషించా అని చెప్పింది మరో హీరోయిన్ రుచిత. ‘సినిమా చూస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు. రియల్ లైఫ్ క్యారెక్టర్స్ను తెరపై చూస్తారు’ అని చెప్పాడు దర్శకుడు అభిషేక్. ఆడియెన్స్ను ఎంటర్టైన్ చేయాలనే లక్ష్యంగా చేసిన సినిమా ఇది అన్నారు నిర్మాత శివ ప్రసాద్. మ్యూజిక్ డైరెక్టర్ అనంత్ శ్రీకర్, రైటర్ అనిరుద్ కృష్ణమూర్తి, సింగర్స్ రోల్ రైడా, ఆర్.ఆర్.ధ్రువన్, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ పాల్గొన్నారు