- 1300 కిలోల పేస్ట్ పట్టివేత..ఒకరి అరెస్ట్
సికింద్రాబాద్, వెలుగు : కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ను తయారు చేస్తున్న యూనిట్ పై ఈస్ట్జోన్టాస్క్ఫోర్స్పోలీసులు దాడి చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్పోలీసులు తెలిపిన మేరకు.. తార్నాక లాలాపేట జనప్రియ అపార్టుమెంట్లో ఉండే నీలా వెంకటేశ్వర్లు(54), కొంతకాలంగా వివిధ రకాల బ్రాండ్ల కంపెనీల అల్లం, వెల్లుల్లి పేస్ట్ ను సిటీలోని మార్కెట్లలో రిటైల్డీలర్లకు సరఫరా చేసేవాడు. అతనికి వచ్చే ఆదాయం సరిపోవడం లేదు. దీంతో ఈజీగా మనీ సంపాదించేందుకు కల్తీ అల్లం, -వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి మార్కెట్లో రిటైల్అమ్మకందారులకు సరఫరా చేసేందుకు ప్లాన్ చేశాడు.
ఇందుకు టైటానియం డయాక్సైడ్మిశ్రమం, జాంతియం గమ్ను కొనుగోలు చేశాడు. వీటితో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి చిరు వ్యాపారులకు సరఫరా చేస్తుండడమే కాకుండా స్వయంగా అల్లం తయారు చేసేందుకు వినియోగించే మెటీరియల్ను సైతం అమ్ముతున్నాడు. సమాచారం మేరకు ఈస్ట్ జోన్పోలీసులు బల్దియా సికింద్రాబాద్సర్కిల్ సిబ్బందితో వెళ్లి వెంకటేశ్వర్లును రెడ్హాండెడ్గా పట్టుకున్నారు.
సుమారు రూ.1.70లక్షల విలువైన 1,300 కిలోల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్, తయారీలో వాడే 20కిలోల టైటానియం డయాక్సైడ్. జాంతియం గమ్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి జీహెచ్ఎంసీ అధికారులకు అప్పగించారు. గతంలో కూడా వెంకటేశ్వర్లు కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేసిన కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు.