పీవీకి భారతరత్న.. స్వీకరించిన కుమారుడు

పీవీకి భారతరత్న.. స్వీకరించిన కుమారుడు

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఐదుగురికి భారతరత్న అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. వారిలో మన తెలంగాణ తేజం, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూడా ఉన్నారు. రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందజేశారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్.. అలాగే, ఎమ్ఎస్ స్వామినాథన్, బీహార్ మాజీ సీఎం. కర్పూరి ఠాకూర్ మరణానంతరం భారతరత్న అవార్డు వరించింది.


 పీవీ నరసింహరావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు,చరణ్ సింగ్ తరఫున ఆయన మనవడు జయంత్ సింగ్ అవార్డును అందుకున్నా రు. ఇక స్వామినాథన్, కర్పూరి ఠాకూర్ తరఫున వారి కుటుంబ సభ్యులు అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ రేపు ఎల్కే అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పలువురు నాయకులు పాల్గొన్నారు.