రెడ్​ అంబులెన్స్ దోపిడీని అరికట్టాలి

రెడ్​ అంబులెన్స్ దోపిడీని అరికట్టాలి
  • ప్రైవేట్ అంబులెన్స్​ ఓనర్స్, డ్రైవర్స్ అసోసియేషన్

పంజాగుట్ట, వెలుగు : రెడ్ అంబులెన్స్ దోపిడీని అరికట్టాలని తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్​ఓనర్స్, డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నక్క మహేశ్ కోరారు. సోమవారం నిమ్స్​ఆవరణలో అంబులెన్సుల ఓనర్లు, డ్రైవర్లతో ఆందోళకు దిగారు. రెడ్​అంబులెన్సుల కారణంగా తమకు నష్టం జరుగుతోందని, సేవ ముసుగులో దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్​రెడ్డి స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆందోళనలో నరేశ్, కుమార్, సతీశ్, ఖలీద్, మనోజ్  పాల్గొన్నారు.