లోకల్​ ట్రాన్స్ మిషన్​ను అడ్డుకోవాలె

లోకల్​ ట్రాన్స్ మిషన్​ను అడ్డుకోవాలె

లోకల్​ ట్రాన్స్ మిషన్​ను అడ్డుకోవాలె
ఎండల్లోనూ కరోనా వైరస్​ వ్యాపిస్తోంది
నిత్యావసరాల కొరత ఏర్పడొద్దు
సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉంటూ లోకల్​ ట్రాన్స్​మిషన్​ను అడ్డుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలకు పిలుపునిచ్చారు. ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ జాగ్రత్త అవసరమని చెప్పారు. కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్​ నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం ప్రారంభమైంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించి, రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను మోడీ అడిగి తెలుసుకున్నరు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో మోడీతో పాటు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, ఇతర అధికారులు పాల్గొనగా.. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి ఈటల, ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్, బెంగాల్ సీఎం మ‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌తా బెన‌‌‌‌‌‌‌‌ర్జీ, పంజాబ్ సీఎం కెప్టెన్ అమ‌‌‌‌‌‌‌‌రీంద‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌, త‌‌‌‌‌‌‌‌మిళ‌‌‌‌‌‌‌‌నాడు సీఎం ప‌‌‌‌‌‌‌‌ళ‌‌‌‌‌‌‌‌నిస్వామి, కేర‌‌‌‌‌‌‌‌ళ సీఎం విజ‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌, మ‌‌‌‌‌‌‌‌హారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు కేంద్ర పాలిత ప్రాంత గ‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ర్నర్​లు పాల్గొన్నారు.

నిత్యావసరాలు అందుబాటులో ఉంచండి

నిత్యావసర వస్తువులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సీఎంలకు ప్రధాని మోడీ సూచించారు. ఫిబ్రవరి తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు జరిపించాలన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే క్వారంటైన్‌‌‌‌‌‌‌‌కు తరలించాలన్నారు. గల్ఫ్​ దేశాల్లోని ఎండల కారణంగా వైరస్​ ఎక్కువగా వ్యాపించదని భావించామన్నారు. ఈ నమ్మకం తప్పని అక్కడ పెద్ద సంఖ్యలో నమోదైన కేసులు చెబుతున్నాయని మోడీ తెలిపారు. ఎండలతో సంబంధం లేకుండా కరోనా వైరస్​వ్యాపిస్తుందని, దీనిని అడ్డుకునేందుకు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.