మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే.?

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే.?


దేశంలో ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ పై లీటరుకు 26 పైసలు, డీజిల్ పై లీటర్ కు 34 పైసల చొప్పున పెరిగింది. తాజా బాదుడుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 91 రూపాయల 53 పైసలకు చేరింది. డీజిల్ లీటర్ 82 రూపాయల 6 పైసలకు పెరిగింది. ఇక ముంబైలో పెట్రోల్ రేట్ వందకు చేరుతోంది. ప్రస్తుతం లీటర్ 97 రూపాయల 86 పైసలుగా ఉంది. డీజిల్ లీటర్ కు 89 రూపాయల 17 పైసలకు చేరింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 95 రూపాయల 13 పైసలుగా ఉండగా... డీజిల్ 89 రూపాయల 47 పైసలకు పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ 93 రూపాయల 38 పైసలు ఉండగా... డీజిల్ 86 రూపాయల 96కి చేరింది.