
న్యూఢిల్లీ: అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన మెట్ గాలా ఈవెంట్ అదిరిపోయింది. ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్తో కలిసి అటెండ్ అయ్యింది. బ్లాక్ గౌనులో మెరిసింది. ఈ ఈవెంట్లో ఆమె ధరించిన డైమండ్ నెక్లెస్.. టాక్ ఆఫ్ ది టౌన్గా నిలి చింది. ఎందుకంటే దాని ధర రూ.205 కోట్లంట. ప్రియాంక చోప్రా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహ రిస్తున్న ఇటలీకి చెందిన జ్యువెలరీ కంపెనీ బల్గరీ ఈ నెక్లెస్ తయారు చేసింది. ‘‘ఇది 11.16 క్యారెట్ల డైమండ్ నెక్లెస్. సింగిల్ స్టోన్ బ్లూ డైమండ్” అని బ్రిటన్ కు చెందిన మీడియా పేర్కొంది.