ప్రసాదం కౌంటర్ సీజ్.. అడ్డుకున్న ఆలయ సిబ్బంది

ప్రసాదం కౌంటర్ సీజ్.. అడ్డుకున్న ఆలయ సిబ్బంది

భద్రాచలం రామాలయంలో అర్చకులు, సిబ్బంది ధర్నాకు దిగారు. లడ్డు ప్రసాదం బూజు విషయంలో పోలీసులకు ఆలయ సిబ్బందికి మధ్య వివాదం తలెత్తింది. లడ్డూ కౌంటర్ను సీజ్ చేయడానికి వెళ్లిన పోలీసులను సిబ్బంది, అర్చకులు అడ్డుకున్నారు. దీంతో లడ్డు కౌంటర్ ముందు సిబ్బంది, అర్చకులు ఆందోళనకు దిగారు. 

నిన్న భద్రాద్రి రామయ్య సన్నిధిలో బూజుపట్టిన లడ్డూలు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. ఫంగస్ వచ్చిన లడ్డూ అమ్మకంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదం కౌంటర్‭లో ఫంగస్ వచ్చిన లడ్డూలు విక్రయించడం ఏంటని ప్రశ్నించారు. ముక్కోటి ఏకాదశికి మిగిలిన లడ్డూలను ఇప్పుడు అమ్ముతున్నారని పెట్టారని భక్తులు ఆరోపిస్తున్నారు. భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడతున్నారని మండిపడ్డారు. సుమారు 50వేల లడ్డూలకు బూజు ఫంగస్ సోకిందని, కళ్యాణ లడ్డూకి కూడా పూర్తిగా ఫంగస్ సోకిందని భక్తులు తెలిపారు. అయితే ఆలయ అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఇదంతా జరుగుతోందని భక్తులు అంటున్నారు. ఈఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.