ఫిట్నెస్ లేదు, ఫైర్ సేఫ్టీ లేదు.. తనిఖీల్లో బయటపడ్డ ప్రైవేట్ బస్సుల డొల్లతనం

ఫిట్నెస్ లేదు, ఫైర్ సేఫ్టీ లేదు.. తనిఖీల్లో బయటపడ్డ ప్రైవేట్ బస్సుల డొల్లతనం
  • జీహెచ్​ఎంసీ  పరిధిలో ఒక్కరోజే 68 కేసులు నమోదు

హైదరాబాద్​సిటీ, వెలుగు: ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు నిబంధనలు పాటించకుండా ప్రయాణికుల ప్రాణాల ను పణంగా పెడుతున్నారు. అధిక లాభాల కోసమే చూస్తున్నారు తప్ప ప్రయాణికుల భద్రతకు చర్యలులు మాత్రం తీసుకోవడం లేదు. కర్నూలులో బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు రంగంలోకి దిగారు. శనివారం భారీ ఎత్తున తనిఖీలు చేపట్టారు. 

ఈ తనిఖీల్లో ప్రైవేట్ బస్సుల నిర్వాహకుల డొల్లతనం బయటపడింది. ఫిట్​నెస్ లోపాలు, డిజైన్ లోపాలు, కెపాసిటీకి మించి ప్రయాణికుల తరలింపుతోపాటు ఫైర్​సేఫ్టీ, ఫస్ట్​ఎయిడ్ వంటి ప్రమాణాలు ఏవీ వారు పాటించడం లేదు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో  ఒక్క రోజే 68 బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. మరో నాలుగు బస్సులు సీజ్ చేశారు.

 జరిమానాగా రూ.1.17 లక్షలు వసూలు చేశారు. విజయవాడ హైవేలో వనస్థలిపురం, ఎల్​బీ నగర్, దిల్​సుక్​నగర్, వరంగల్ హైవేలో ఉప్పల్, బెంగళూరు రోడ్డు, నాగ్​పూర్ రూట్​లోనూ మేడ్చల్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచే ప్రారంభమైన ఈ తనిఖీలు రాత్రి వర కూ కొనసాగాయి. జిల్లాల పరిధిలో కూడా అధికారు లు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు ఉంటాయనే అంచనా తో చాలా మంది బస్ ఆపరేటర్లు శనివారం తమ బస్సులను రోడ్లపైకి తీసుకు రాలేదు. 

డిజైన్ మార్పులతో ప్రమాదాలు

తనిఖీల్లో ప్రైవేటు బస్సుల్లో పెద్దయెత్తున లోపాలు బయటపడ్డట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు. గ్రేటర్​హైదరాబాద్ నార్త్​జోన్ పరిధిలో 23 కేసులు నమోదు చేయగా ఇందులో ఆయా బస్సుల సీట్ల కింద ఏర్పాటు చేసిన క్యాబిన్​లలో నిబంధనలకు విరుద్ధంగా వివిధ గూడ్స్​ను రవాణా చేస్తున్నట్టు గుర్తించామన్నారు. ఈ గూడ్స్ బరువు వల్ల ఓవర్​లోడ్​అయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. 

వెస్ట్ జోన్ పరిధిలో 9 కేసులు, సౌత్​జోన్ పరిధిలో 9 కేసులు, ఈస్ట్​జోన్ పరిధిలో ఆరు కేసులు నమోదు చేయగా.. ఆయా బస్సుల్లో ఫైర్​సేఫ్టీ లేక పోవడం, భారీఎత్తున గూడ్స్ క్యారీ చేస్తున్నట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 14 కేసులు నమోదు కాగా.. బస్సులో సీట్లను ఇష్టం వచ్చినట్టుగా ఆల్ట్రేషన్ చేయడంతోపాటు సరైన డాక్యుమెంట్లు లేవని చెప్పారు. మేడ్చల్ జిల్లాలో ఏడు కేసులు నమోదుకాగా ఇందులో ఆరు బస్సులు అసలు టాక్సులు చెల్లించడం లేదన్నారు. ఈ సందర్భంగా ఫిట్​నెస్​ లేని నాలుగు బస్సులను సీజ్​చేసినట్టు తెలిపారు.

పది నెలల్లో 877 బస్సులు సీజ్

గ్రేటర్​ పరిధిలో ఆర్టీఏ అధికారులు ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు అంటే 10 నెలల కాలంలో 8,848 కేసులు నమోదు చేశారు. కాంపౌండింగ్ ఫీజు రూపంలో రూ.2.28 కోట్లు వసూలు చేశారు.   ఫిట్​నెస్​లేని కారణంగా 877 వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపారు.