ఐదు నెలలు తర్వాత ఏపీ నుంచి హైదరాబాద్ కు ప్రైవేటు బస్సులు

ఐదు నెలలు తర్వాత ఏపీ నుంచి హైదరాబాద్ కు ప్రైవేటు బస్సులు

అన్‌లాక్ 4లో అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఐదు నెలల తర్వాత ప్రైవేటు బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారుల అనుమతితో ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్‌కు బస్సులు తిప్పుతున్నారు. ఏపీలోని ప్రధాన ప్రాంతాల నుంచి శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి. 150 ప్రైవేటు బస్సులకు ఆన్‌లైన్‌లో టికెట్‌ రిజర్వేషన్‌ విధానాన్ని ఆపరేటర్లు మొదలుపెట్టారు. పరిస్థితిని బట్టి సర్వీసుల్ని పెంచేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ సిద్ధమయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో కూడా కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్, వీలైనంత వరకు భౌతిక దూరం పాటించేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఐదు నెలలుగా హైదరాబాద్‌కు బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. లేటెస్టుగా ట్రావెల్స్ బస్సులకు లైన్ క్లియర్ కావడంతో మళ్లీ బస్సులు రోడ్డెక్కాయి.

మరోవైపు హైదరాబాద్‌, తెలంగాణకు ఏపీ నుంచి ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు అంతర్రాష్ట్ర  అగ్రిమెంట్ కుదుర్చుకునేందుకు ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. సర్వీసుల పెంపునకు  TS RTC గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఆర్టీసీ సర్వీసులు నడటపంపై ఇంకా క్లారిటీ రాలేదు.