
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్పై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రాజకీయ నాయకులు, నేరగాళ్లు కలిసి రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విషయం ఈ కాన్పూర్ కేసుతో బయటపడిందని ఆరోపించారు. వికాస్ దుబేను ఈ స్థాయిలో పెంచి పోషించింది ఎవరన్నది తేలాలని డిమాండ్ చేశారు. అతడి వెనుక ఉన్న రాజకీయ శక్తులు ఎవరనేది ప్రజలకు తెలియాలన్నారు. నేరగాడి (వికాస్ దుబే)ని చంపేశారని, అయితే అతడు చేసిన నేరాలు, వాటి ఉన్న ఉన్నవాళ్లు ఎవరూ, అతడి ప్రొటెక్ట్ చేస్తూ వచ్చిందెవరన్న విషయాలను తేల్చాలని అన్నారు ప్రియాంక. ఈ మొత్తం కేసుపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిందామె. ఉత్తర్ ప్రదేశ్ను బీజేపీ అపరాధ్ ప్రదేశ్గా మార్చేసిందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. పిల్లలపై, దళితులు, మహిళలపై దాడుల్లో, మారణాయుధాలు, హత్యల్లో యూపీ నెంబర్ 1గా ఉందని అన్నారు. రాష్ట్రంలో వికాస్ దుబే వంటి నేరగాళ్ల సామ్రాజ్యం నడుస్తోందని, అతడి రక్షణ కల్పించింది రాజకీయ నాయకులేనని దేశం మొత్తానికి తెలుసని చెప్పారు ప్రియాంక. నేరగాళ్లకు, రాజకీయ నేతలకు మద్య ఉన్న సంబంధాలను బయటపెట్టాలని, ఇందుకోసం దుబే వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరగాలని అన్నారు.
अपराधी का अंत हो गया, अपराध और उसको सरंक्षण देने वाले लोगों का क्या?
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 10, 2020
కాన్పూర్ లో 8 మంది పోలీసులను చంపిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దుబేను నాటకీయ పరిణామాల మధ్య ఉజ్జయినిలో పోలీసులు అరెస్ట్ చేసి కాన్పూర్ తీసుకుని వస్తుండగా.. ఎన్కౌంటర్ జరిగింది. వికాస్ దుబేను కాన్పూర్ తరలిస్తున్న కారుకు యాక్సిడెంట్ జరగడంతో అతడు పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కుని కాల్పులు జరిపే ప్రయత్నం చేయడంతో ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు చేయడంతో దుబే మరణించినట్లు యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అతడి వెనుక రాజకీయ నేతలు ఉన్నారని, వారి వివరాలు బయటకు రానీయకుండా దుబేను హతమార్చారని ఆరోపించారు ప్రియాంక గాంధీ.
उप्र की कानून-व्यवस्था बदतर हो चुकी है। राजनेता-अपराधी गठजोड़ प्रदेश पर हावी है। कानपुर कांड में इस गठजोड़ की सांठगांठ खुलकर सामने आई।
कौन-कौन लोग इस तरह के अपराधी की परवरिश में शामिल हैं- ये सच सामने आना चाहिए।
सुप्रीम कोर्ट के मौजूदा जज से पूरे कांड की न्यायिक जाँच होनी चाहिए pic.twitter.com/vRHQlsaJ3y
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 10, 2020