ఆ సినిమాకి సీక్వెల్ లేనట్టేనా? పాపం ఫ్యాన్స్

ఆ సినిమాకి సీక్వెల్ లేనట్టేనా?  పాపం ఫ్యాన్స్

తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్ లో బెస్ట్ మూవీ అంటే టక్కున గుర్తొచ్చే పేరు గజిని. తమిళ డైరెక్టర్ మురగదాస్ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. 2005లో వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకులు ఫిదా ఐపోయారు. కొత్త కథ, సరికొత్త స్క్రీన్ ప్లే, బెస్ట్ టేకింగ్ వెరసి ఈ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాయి. షార్ట్ టర్మ్ మెమరీ లాస్ పేషెంట్ గా సూర్య నటన అద్భుతం అనే చెప్పాలి.

ఈ సినిమా తరువాతే సూర్య స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోయాడు. ఇక దాదాపు 18 సంవత్సరాల తరువాత ఈ సినిమాకి సీక్వెల్ రానుంది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. గజిని సినిమాని అదే పేరుతో అమీర్ ఖాన్ హీరోగా రీమేక్ చేశాడు దర్శకుడు  ఎ ఆర్ మురగదాస్.  టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమాని హిందీలో నిర్మించి భారీ లాభాలు అందుకున్నాడు. ఇక అప్పటి నుండి ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్నాడు అల్లు అరవింద్.

ఇందులో భాగంగానే ఆయన ఈ మధ్య ఆమీర్ ఖాన్ ని కలిశాడని, కథ చర్చలు కూడా జరిగాయని, అతిత్వరలో ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుంది అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న నిర్మాత ఆల్లు అరవింద్ ఈ రూమర్స్ కి చెక్ పెట్టేశాడు.  గజిని సీక్వెల్ పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, గజిని సినిమా సీక్వెల్ నిర్మాణం విషయంలో ఇప్పటి వరకు చర్చలు జరగలేదని, ఆ ఆలోచన కూడా లేదు అన్నట్లుగా అల్లు అరవింద్ పేర్కొన్నాడు. దీంతో.. చాలా కాలంగా గజిని సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది.