ఘనంగా ప్రోఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

ఘనంగా ప్రోఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

ప్రోఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా… హైదరాబాద్ లోని అమరవీరుల స్మారక స్థూపం పనులు పరిశీలించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. లుంబిని పార్క్ లో అమరవీరుల స్థూపం నిర్మిస్తున్నామన్న ఆయన..  3 ఎకరాల 20 గుంటల స్థలంలో వంద కోట్లతో స్థూపం నిర్మిస్తున్నామన్నారు.  పార్కింగ్ తో పాటు మ్యూజియం, ఫోటో గ్యాలరీ, ఆడియో రూమ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే సందర్శకులు కూడా తెలంగాణ ఉద్యమం గురించి తెలుసుకునేలా మ్యూజియం ఉంటుందన్నారు.

ప్రోఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను వరంగల్ లో ఘనంగా నిర్వహించారు.  హన్మకొండ ఏకశిలా పార్కులో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. జయశంకర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. జయశంకర్ ఆశయాలను నెరవెర్చడమే ఆయనకు నిజమైన నివాళులన్నారు.