
- హక్కుల సంఘాలకు ప్రొఫెసర్ హరగోపాల్ సూచన
హైదరాబాద్, వెలుగు: చత్తీస్గఢ్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్లో 30 వేల మంది కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు మావోయిస్టులను, ఆదివాసీలను చుట్టుముట్టి ఫైరింగ్ చేస్తున్నాయని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. బస్తర్ ఐజీ సుందర్ రాజ్ మావోయిస్టులను లొంగిపొమ్మని హెచ్చరిస్తున్నారని, లేదంటే చావుకు సిద్ధం కావాలంటూ బెదిరిస్తున్నారన్నారు.
ఆ ప్రాంతంలో గణపతి, హిడ్మా వంటి నాయకులు ఉన్నారని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, వామపక్ష పార్టీలు, మేధావులు ఈ మారణహోమం పై వెంటనే స్పందించాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు. చట్ట ప్రకారం హత్యలు చేయడం, హత్య చేస్తామని పోలీసులు హెచ్చరించడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని మండిపడ్డారు.