ఓయూ సమస్యల పరిష్కారమే లక్ష్యం

ఓయూ సమస్యల పరిష్కారమే లక్ష్యం

ఓయూ, వెలుగు:  ఉస్మానియా వర్సిటీ సమస్యల పరిష్కారమే ఎజెండాగా తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ పని చేస్తుందని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రొఫెసర్​ మల్లేశం తెలిపారు.  అందులో భాగంగానే టీఎస్ యూటీఏ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.  

ఈ మేరకు  శుక్రవారం ఓయూలో జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడు ప్రొఫెసర్​ మల్లేశం మాట్లాడుతూ..   విశ్వవిద్యాలయాలకు రావాల్సిన గ్రాంట్లు, ఖాళీల నియామకాలు, పదవీ విరమణ కాలం పెంపు ప్రయోజనాలు తదితర అంశాలపై చర్చించినట్లు చెప్పారు. సమావేశంలో వివిధ యూనివర్సిటీ అధ్యాపకులు పాల్గొన్నారు.