ఓయూ, వెలుగు: ఉస్మానియా వర్సిటీ సమస్యల పరిష్కారమే ఎజెండాగా తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ పని చేస్తుందని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రొఫెసర్ మల్లేశం తెలిపారు. అందులో భాగంగానే టీఎస్ యూటీఏ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఈ మేరకు శుక్రవారం ఓయూలో జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడు ప్రొఫెసర్ మల్లేశం మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాలకు రావాల్సిన గ్రాంట్లు, ఖాళీల నియామకాలు, పదవీ విరమణ కాలం పెంపు ప్రయోజనాలు తదితర అంశాలపై చర్చించినట్లు చెప్పారు. సమావేశంలో వివిధ యూనివర్సిటీ అధ్యాపకులు పాల్గొన్నారు.