హామీల అమలులో కాంగ్రెస్ విఫలం ..మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం ..మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి

వికారాబాద్​, వెలుగు: అనేక వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం.. ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. మంగళవారం వికారాబాద్​ జిల్లా నవాబుపేటలో ఏర్పాటు చేసిన బీఆర్​ఎస్​ పార్టీ మీటింగులో ఆమె మాట్లాడారు. 

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని సీఎం రేవంత్​రెడ్డి చెప్పినట్లు గుర్తు చేశారు. కానీ మాటలతో మభ్యపెడుతున్నారే తప్ప పథకాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ఈ మీటింగులో ఎమ్మెల్యే కాలే యాదయ్య కోసం ఒక కుర్చీ ఏర్పాటు చేశారు. 

ఆయన బీఆర్​ఎస్​ నుంచి గెలిచి కాంగ్రెస్​లోకి వెళ్లడంతో నిరసనగా ఇలా ఆయనకు కుర్చీ వేశారు. కార్యక్రమంలో బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు డాక్టర్​ మెతుకు ఆనంద్​, బీసీ కమిషన్​ మాజీ సభ్యుడు ఎన్​.శుభప్రద్​పటేల్​, రాష్ట్ర విద్య, మౌళిక వసతుల కల్పన కార్పొరేషన్​ మాజీ చైర్మన్​ జి.నాగేందర్​గౌడ్, జడ్పీ మాజీ వైస్​ చైర్మన్​ విజయ్​కుమార్​ పాల్గొన్నారు.