తిండి కలిగితే కండ కలదోయ్.. కండ కలవాడేను మనిషోయ్ అన్నారు గురజాడ అప్పారావు. మరి తినే తిండిలో మాంసకృత్తులు (ప్రొటీన్లు) లేకపోతే కండరాలకు నష్టమంటున్నారు డాక్టర్లు. ఈ మాంసకృత్తులు శరీర నిర్మాణానికి ఎంతో అవసరం. మరి అలాంటివి తినే ఆహారంలో లేకపోతే కండరాలు బలహీనపడతాయి. అంతేకాదు వాటి పెరుగుదల కూడా ఆగిపోతుంది. అయితే ఈ పరిస్థితి మన భారతీయుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తోందంటోంది తాజా సర్వే.
దక్షిణ కొరియాకు చెందిన ఇప్పోస్-ఇన్ బాడీ అనే సంస్థ హైదరాబాద్, ఢిల్లీ ముంబై, కోల్ కతా, చెన్నై అహ్మదాబాద్, లక్నో, పాట్నా.. మొత్తం ఎనిమిది నగరాల్లోని 30-55 ఏళ్ల వయసున్న వాళ్లపై అధ్యయనం చేసింది. దాని ప్రకారం... 68 శాతం మంది భారతీయులు మాంసకృత్తుల లోపాన్ని ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్ లో ఇలాంటి వాళ్ల సంఖ్య 75 శాతం కన్నా ఎక్కువే ఉందట. అయితే ఇండియన్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో (ఐఎంఆర్ టీ) అనే సంస్థ ఇంతకు ముందు విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో 73 శాతం మందిలో మాంసకృత్తులు అలాగే మంది భారతీయ శాకాహారులు 65 శాతం మంది మాంసాహారులు. శరీరానికి సరిపడా ప్రొటీన్లు తీసుకోవడం లేవని ఆ నివేదిక వెల్లడించింది. అంతేకాదు 93 శాతం మందికి రోజుకు ఎంత మేరకు ప్రొటీన్లు తీసుకోవా లోకూడా తెలియదని వేదిక వెల్లడించింది. ఇప్పోన్ -ఇన్ బాడీ అధ్యయనం ప్రకారం.. దేశంలో 71% మందికి కండరాల ఆరోగ్యం సరిగా లేదు. భారతీయుల కండరాలు బలంగా లేకపోవడానికి ప్రొటీన్ల లోపమే కారణమంటున్నారు నిపుణులు.
కండరాలకు ప్రొటీన్లే ముఖ్యం
శరీరానికి కావలసినంత ప్రొటీన్ మ రోజువారీ ఆహారంలో తీసు కోవాలి. అయితే మన భారతీయుల్లో 30-40 శాతం మంది సరిపడా ప్రొటీన్లను తీసుకోవడం లేదు. ఇప్పుడు చాలామంది ఫ్యాట్ లో బరువు పెరుగుతున్నారు తప్ప ఆరోగ్యవం తమైన కండరాలతో కాదు. ముఖ్యంగా పిల్లలకు కూడా సరైన పద్ధతిలో ప్రొటీన్లు అందించడంలేదు. ఒకప్పుడు ఆరు నెలలు దాటగానే పప్పులతో తయారు చేసిన ఉగ్గు పెట్టే వాళ్లు ఇప్పుడు అలా కాకుండా షాపుల్లో దొరికి రెడీమేడ్ ఫుడ్స్ పెడుతున్నారు. పల్లీలు, బెల్లం కలిపి చేసే పల్లిపట్టీ లాంటివి కాకుండా చాకోలెట్స్. చిప్స్ ఇస్తున్నారు.
దాంతో పిల్లలకు ప్రొటీన్లు సరిగా అందక కండరాల సమస్యతో బాధపడుతున్నారు. చాలామందికి ఎదుగుదల మందగిస్తోంది. అలాగే టీనేజర్లు కూడా బయట దొరికే ఆహారానికే అలవాటు పడి ఇంట్లో పాలు తాగడం, గుడ్లు తినడం మానేస్తున్నారు. దానివల్ల సహజంగా లభించే ప్రొటీన్లకు దూరమవుతున్నారు. పసి పిల్లలో ఆరు నెలల తర్వాత నుంచి ఇంట్లో తయారు చేసిన ఉగ్గునే పెట్టాలి. అందులో అన్ని రకాల పప్పు ధాన్యాలు ఉంటాయి. కాబట్టి ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి. అలాగే పాలు తప్పని సరిగా పట్టాలి. ఏడో నెల నుంచి గుడ్డు పచ్చసొన మొదలు పెట్టాలి.
అలా చేస్తే ఏడాది వయసు వచ్చేసరికి మొత్తం గుడ్డును తినగలుగుతారు. స్కూల్ కు వెళ్లే పిల్లలకు కూడా రోజూ తప్పనిన రిగా రెండుసార్లు పాలు తాగించాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా ఒక గుడ్డు, అన్నిపూటలా ఆహారంలో ఉడికించిన శనగలు, బొబ్బర్లు, అలసందలు వంటివి పెట్టాలి. ఏ వయసు వారైనా పాలు, గుడ్డు తీసుకోవాలి. మాంసాహారులైతే చేపలు, చికెన్, గుడ్లు వంటివి తినాలి. అలా అని బయట దొరికే బిర్యానీలు, వెరైటీ స్నాక్స్ కాకుండా ఎక్కువ మసాలాలు లేకుండా ఉడికించినవి తింటే మంచిది.
ఇవి తినాలి...
- పాల సంబంధిత ఉత్పత్తులు (పాలు, పెరుగు, వెన్న, పనీర్ మొదలైనవి)
- గుడ్లు
- చేపలు, రొయ్యలు, కోడి మాంసం
- పల్లీలు, పుట్నాలు, సోయాబీన్స్.. శెనగలు, కందులు, పెసళ్లు, బొబ్బర్లు. రాజ్మ మొదలైనవి
- తాజా కూరగాయలు, ఆకుకూరలు
వెలుగు,లైఫ్

