ఎమ్మెల్యే రసమయికు నిరసన సెగ.. పబ్లిక్​ని తోసేసిన అనుచరులు

ఎమ్మెల్యే రసమయికు నిరసన సెగ.. పబ్లిక్​ని తోసేసిన అనుచరులు

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతరంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​పర్యటించారు. స్థానిక ఎస్సీ కాలనీకి రాగానే ఆయనకు దళితుల నుంచి నిరసన సెగ తగిలింది. స్థానికులు ఆయన పర్యటనను అడ్డుకున్నారు. ఇళ్లు లేక తాము రోడ్లపై నివసిస్తున్నామని, ప్రభుత్వం ఇస్తామన్న డబుల్​బెడ్రూం ఇళ్లు ఏవని ఎమ్మెల్యేను నిలదీశారు.

ఈ క్రమంలో నిరసనకారులకు ఎమ్మెల్యే అనుచరులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అనుచరులు  నిరసనలు తెలపకుండా దళితులను అడ్డుకుని తోసేశారు.  ఈ పరిణామాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబల్​ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్​ చేశారు.