రోహిత్‌, బుమ్రా లేకున్నా గెలిచాం

రోహిత్‌, బుమ్రా లేకున్నా గెలిచాం

స్టార్‌‌ ప్లేయర్లు రోహిత్‌‌ శర్మ, బుమ్రా లేకుండానే ఆస్ట్రేలియా గడ్డపై  టీ20 సిరీస్‌‌ గెలవడం చాలా సంతోషంగా ఉందని టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ అన్నాడు. ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యా అద్భుతంగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు. ‘టీ20 ఫార్మాట్‌‌లో మేం సమష్టిగా రాణిస్తున్నాం. ఈ ఫార్మాట్‌‌లో మా కీలక ప్లేయర్లు రోహిత్‌‌, బుమ్రా లేకుండా సిరీస్‌‌ గెలిచాం. పాండ్యాలో టాలెంట్‌‌కు కొదువలేదు. ఏ స్థానంలో బ్యాటింగ్‌‌కు దించినా మ్యాచ్‌‌ను గెలిపిస్తాడు. 4, 5 ఏళ్లలో టీమ్‌‌కు చాలా విలువైన ప్లేయర్‌‌గా ఎదుగుతాడు. మ్యాచ్‌‌ ఫినిషర్‌‌గా అతని ప్లాన్స్‌‌ చాలా బాగున్నాయి. టీ20ల్లో మా ప్లేయర్లు పటిష్టంగా మారడానికి కారణం ఐపీఎల్‌‌. చాలా మంది టాలెంటెడ్‌‌ క్రికెటర్లు మాకు అందుబాటులో ఉన్నారు. ఐపీఎల్‌‌లో ప్రతి ఒక్కరు 14 మ్యాచ్‌‌లు ఆడారు. కాబట్టి ఎవరి ప్రణాళికలు వాళ్లకు తెలుసు. నటరాజన్‌‌ సూపర్బ్‌‌ ప్లేయర్‌‌. శార్దూల్‌‌ బౌలింగ్‌‌ కూడా బాగుంది. బౌండ్రీ లైన్‌‌ కూడా చిన్నగా ఉండటంతో టార్గెట్‌‌ ఛేజ్‌‌ చేస్తామని ముందే ఊహించాం. ఓవరాల్‌‌గా టీమ్‌‌ మొత్తం రాణించడంతోనే ఇది సాధ్యమైంది’ అని మ్యాచ్‌‌ అనంతరం కోహ్లీ వ్యాఖ్యానించాడు.