ఖమ్మం, వెలుగు: సీబీఐ సహా ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని, మమత మెడికల్ కాలేజీ దగ్గర ఒక్క గజమైనా కబ్జా చేసినట్లు నిరూపించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మంత్రి పువ్వాడ అజయ్ సవాల్ విసిరారు. మంగళవారం టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ది బట్ట కాల్చి మీదేసే సంస్కృతి అని మండిపడ్డారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొడంగల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని రేవంత్ చేసిన సవాల్ ఏమైందని ప్రశ్నించారు.
‘‘మమత కాలేజీకి అనుమతులు వచ్చిన టైమ్లో రేవంత్ పెయింటర్గా ఉన్నారు. భూకబ్జాలు, దందాలు రేవంత్కే అలవాటు. సుపారీ చెల్లించి పదవి తెచ్చుకున్న వాళ్లకు నన్ను విమర్శించే అర్హత లేదు. కాంగ్రెస్ గత ఎన్నికల్లో కమ్మ వర్గానికి ఒక్క టికెట్ అయినా ఇచ్చిందా?” అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్బ్యాక్గ్రౌండ్ ఉన్న రేవంత్.. కాంగ్రెస్లో ఉండి తన సీక్రెట్ ఎజెండాను అమలు చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినంక ఖమ్మం నుంచి పారిపోయిన రేణుకా చౌదరి.. ధైర్యం లేక రేవంత్ను వెంటబెట్టుకొని వచ్చారని విమర్శించారు.