రామగుండంలో రెచ్చిపోయిన TRS కార్పొరేటర్

 రామగుండంలో రెచ్చిపోయిన  TRS  కార్పొరేటర్

పెద్దపల్లి జిల్లా: రామగుండంలో అధికార పార్టీ కార్పొరేటర్ రెచ్చిపోయారు. గోదావరిఖని ఉదయ్ నగర్ లోని ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ లను ఢీకొట్టింది కార్పొరేటర్ గట్టయ్య కారు. దీంతో వారిని ప్రశ్నించడంతో కార్మిక కుంటుంబంపై దాడికి దిగాడు కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య, మరో కార్పొరేటర్ భర్త జలపతి, కార్మిక సంఘం నాయకుడు శ్రీనివాస్. మహిళ అని కూడా చూడకుండా తనపై దాడి చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు గూండాల్లాగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ ఆపేందుకు ప్రయత్నించిన జర్నలిస్టు పై కూడా దాడి చేశారని బాధిత కుటుంబం చెబుతోంది. వెంటనే దాడికి పాల్పిడిన టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు

ప్రభుత్వ యూనివర్సిటీలను సర్కార్ లైట్ తీసుకుందనే విమర్శలున్నాయి. యూనివర్సిటీల్లో సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు కొత్త వివాదాలు సృష్టిస్తూ వర్సిటీల నాణ్యత ప్రమాణాలు దెబ్బతీస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ టైమ్ లో కీలక పాత్ర పోషించిన ఓయూ కొత్త వివాదాలకు కేరాఫ్ గా మారుతుంది. అధికారుల నిర్లక్ష్యం, వింత నిర్ణయాలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.