ఖమ్మం, వెలుగు: ‘అపార అనుభవం ఉన్న నాయకులను పార్టీ కోసం ఉపయోగించుకోవాలి. ఓడిపోయినంత మాత్రాన పక్కన పెట్టినట్టు కాదు.’ ఐదు రోజుల క్రితం ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ముఖ్యనేతల సమావేశంలో కేటీఆర్చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన 16 మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించే కేటీఆర్ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ సీనియర్లీడర్లు భావిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తరపున గెలిచిన 12 మంది, టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు, ఇండిపెండెంట్లుగా విజయం సాధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు మొత్తం 16 మంది టీఆర్ఎస్లోకి జంప్అయ్యారు. ఇందులో అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారే ఏడుగురున్నారు. ఇతర పార్టీల్లో గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరినవారికి, ఆ స్థానాల్లో కారు గుర్తుపై పోటీ చేసి ఓడిపోయిన వారికి మధ్య రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విభేదాలు కొనసాగుతున్నాయి. పలుసార్లు సర్దిచెప్పినా లీడర్లు తీరు మారలేదు. ఆయా ప్రాంతాల్లో సిట్టింగులకు టికెట్లు ఇస్తే టీఆర్ఎస్క్యాడర్వ్యతిరేకంగా పనిచేసే చాన్స్ఉండడం, మరోవైపు కాంగ్రెస్కు ఓటేస్తే టీఆర్ఎస్కు వేసినట్లేనని, గెలిచిన తర్వాత మళ్లీ టీఆర్ఎస్లో చేరతారని బీజేపీ చేస్తున్న ప్రచారం రూలింగ్పార్టీని కలవరపెడుతోంది. దాంతో సీనియర్లీడర్లను మళ్లీ దగ్గరకు తీసుకుంటోంది.
ఖమ్మం టీఆర్ఎస్ లో వర్గపోరు
ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పాలేరు నుంచి కందాల ఉపేందర్రెడ్డి, వైరా నుంచి రాములునాయక్, ఇల్లందు నుంచి హరిప్రియ, పినపాక నుంచి రేగా కాంతారావు, కొత్తగూడెం నుంచి వనమా వెంకటేశ్వరరావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గులాబీ పార్టీలో చేరారు. ప్రధానంగా కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరినవారికి టీఆర్ఎస్కేడర్ దూరంగా ఉంటోంది. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ఎమ్మెల్యేలు మళ్లీ పోటీ చేస్తే ఓడించాలన్న కసి కాంగ్రెస్కేడర్లో కనిపిస్తోంది. దీన్ని పీకే టీమ్సర్వేల్లో గుర్తించడం వల్లే ఇన్నాళ్లూ మాజీలను లైట్ తీసుకున్న టీఆర్ఎస్హైకమాండ్ఇప్పుడు వారిని దగ్గరకు తీస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే సూపర్పవర్అంటూ వారికి హైకమాండ్పూర్తిస్థాయి పగ్గాలు ఇచ్చింది. ఓడిపోయినంత మాత్రాన మాజీలను పక్కనపెట్టినట్టు కాదని, వాళ్ల అనుభవాన్ని కూడా పార్టీ కోసం ఉపయోగించుకోవాలంటూ ప్రస్తుతం కేటీఆర్చేసిన కామెంట్ తో ఇకపై ఎమ్మెల్యేలే సూపర్పవర్కాదని పరోక్షంగా చెప్పినట్లయింది.
దూకుడు తగ్గించిన సీనియర్లు
పాలేరులో గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాల టీఆర్ఎస్లో చేరడంతో అక్కడ వర్గపోరు మొదలైంది. దీంతో పరిస్థితులను బేరీజు వేసుకొని నియోజకవర్గంలో రెగ్యులర్పర్యటనలతో తుమ్మల మళ్లీ యాక్టివ్అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎలాగైనా పాలేరు నుంచి పోటీలో ఉంటానని చెబుతూ వస్తున్నారు. దీంతో ఒక సమయంలో ఆయన పార్టీ మారే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. అయితే మూడేళ్ల నుంచి ఎన్నడూ లేని విధంగా ఇటీవల ఆయన హైదరాబాద్వెళ్లి కేటీఆర్తో గంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా రాజకీయాలపై చర్చ జరిగిందని, హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పార్టీ టికెట్ పై తుమ్మల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక కొల్లాపూర్లోనూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన హర్షవర్ధన్గెలిచారు. తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకొని తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అప్పటి నుంచి జూపల్లి ఆగ్రహంతో ఉన్నారు. కొంతమంది కలిసివచ్చేవారితో వేరే పార్టీలోకి వెళ్లేందుకు ఆయన రూట్ క్లియర్చేసుకుంటున్నారన్న ప్రచారం జరిగింది. కానీ, ఈ మధ్య ఆయన స్పీడ్ తగ్గించి సైలెంట్ అయ్యారు. తనకు మళ్లీ టీఆర్ఎస్లో ప్రాధాన్యత ఉంటుందన్న సంకేతాలు రావడమే దీనికి కారణమన్న ప్రచారం జరుగుతోంది.
పార్టీ మారినవాళ్లలో అంతర్మథనం
రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్రెగ్యులర్గా ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐప్యాక్టీమ్ ద్వారా సర్వేలు చేయిస్తున్నారు. ఈ సర్వేల్లో 35 మంది సిట్టింగులపై తీవ్ర వ్యతిరేకత ఉందని గుర్తించినట్లు సమాచారం. వీరిలో ప్రధానంగా కాంగ్రెస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారన్న టాక్ఉంది. ఖమ్మంలో కేటీఆర్కామెంట్లు చేయడానికి ఇదే కారణమన్న విశ్లేషణలున్నాయి. అయితే కేటీఆర్కామెంట్స్పై పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాత్రం కొంత అంతర్మథనంతో ఉన్నారు. ఎవరి గురించి ఈ కామెంట్లు చేశారా అని ఆరా తీస్తున్నారు. అన్కండిషనల్ గా పార్టీలో చేరితే, ఇప్పుడు కొత్తగా ఈ టెన్షన్ ఏమిటని మధన పడుతున్నారు. అయితే ప్రస్తుతానికి పార్టీకి, హైకమాండ్కు వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్మెంట్ చేయకుండా మౌనం పాటిస్తున్నారు.