కరోనా పోయిన తర్వాత పబ్లిక్ షాపింగ్ ఎలా ఉంటుందంటే..

కరోనా పోయిన తర్వాత పబ్లిక్ షాపింగ్ ఎలా ఉంటుందంటే..

ఖర్చు తక్కువ .. పొదుపు ఎక్కువ
షాపర్స్ కొత్త మంత్రం..లాక్డౌన్ తర్వాత ఇదే పరిస్థితి
దేశమంతటా మారనున్న కొనుగోలు తీరు
నిత్యావసరాలకే ఇంపార్టెన్స్
సినిమాలు, షికార్లు బంద్.. హెల్త్ కే ప్రయారిటీ
నీల్సన్ తాజా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: లాక్డౌన్ ముగిసిన తర్వాత జనం ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. లగ్జరీ వస్తువులు, సినిమాలు, షికారక్లంటే.. నిత్యావసరాలు.. హెల్త్ కే షాపర్స్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని నీల్సన్ తాజా సర్వే వెల్లడించింది. తక్కువ ఖర్చు పెట్టాలని, ఎక్కువ పొదుపు చేయాలనేది ఇప్పుడు వారి మంత్రమని పేర్కొంది. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ కు వెళడ్లం మానేసి.. హెల్త్, హైజీన్ ప్రొడక్స్ట్
పైనే అందరూ ఫోకస్ చేస్తారని వివరించింది. ఈ సర్వేలో పాల్గొన్న దాదాపు 64 శాతం మంది లాక్డౌన్ తర్వాత తాము రెస్టారెంట్ లు, మూవీలకు
వెళ్లడం తగ్గిస్తామని చెప్పారని తెలిపింది. నిత్యావసర వస్తువులైన బియ్యం, గోధుమలు, సబ్బులు మొదలైన వాటిని కొనిపెట్టుకోవడంపై వీరంతా
దృష్టిపెడతారంది. దేశంలో కరోనా ఇంపాక్ట్ పై 23 నగరాల్లోని 1,330 మందిపై ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 14 మధ్య ఈ ఆన్ లైన్ సర్వే నిర్వహించింది.

ఇంటి ఫుడ్ కే ఇంపార్టెన్స్
భవిష్యత్లో బయట ఆహారం తినడం కన్నా ఇంట్లో వండిన ఫుడ్ తినడానికే జనం ఎక్కువ మొగ్గుచూపుతారని, ఇంట్లోనే ఉండి.. హెల్దీ ఫుడ్ వండుకోవడానికి ఇష్టపడతారని మ్యారీకో ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజయ్ మిశ్రా చెప్పారు. ‘‘కస్టమర్ల నమ్మకాన్ని మళ్లీ పొందడానికి బ్రాండ్స్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే వారికి కావాల్సిన ప్రొడక్టులను తయారు చేయాలి” అని పిజ్జా హట్ మార్కెటింగ్ డైరెక్టర్ నేహ చెప్పారు. లాక్డౌన్ ఎత్తేసినా.. నార్మల్ పరిస్థితులు వచ్చినా.. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లేందుకు జనం
ఇంట్రెస్ట్ చూపించక పోవచ్చని, ఎయిర్ లైన్స్, రెస్టా రెంట్స్, క్లబ్బులు, మెట్రోలు.. ఏవీ దీనికి మినహాయింపు కాదని నీల్సన్ గ్లోబల్ కనెక్ట్ సౌత్ ఏషియా వెస్ట్ మార్కెట్ లీడర్ సమీర్ చెప్పారు. గూడ్స్, సర్వీసులను అందించడంలో హైజీన్ అనేది బ్రాండ్లకు భవిష్యత్లో ఎక్కువ అవకాశాలను కల్పిస్తుందన్నారు.

నోలగ్జరీ ప్లీజ్..
43% మంది ఫ్యాషన్, పర్సనల్ గ్రూమింగ్, హోం డెకరేషన్ కు పెద్దగా ఖర్చు పెట్టబోమని చెప్పారు. 54 % మంది ఆటోమొబైల్స్ పై ఎక్కువ స్పెండ్ చేయబోమన్నారు. కరోనా ఎఫెక్ట్ ముగిశాక పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కంటే పర్సనల్ వెహికల్స్ ను వాడేందుకే ఎక్కువ ఆసక్తిచూపిస్తారని భావిస్తుండగా జనం ఆలోచన వేరేగా ఉండటం విశేషం. 54% మంది లగ్జరీ ప్రొడక్స్ట్, అనవసర ప్రయాణాలు పెట్టుకోమని చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రతకు, సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని దాదాపు 56 శాతం మంది చెప్పారు. హెల్దీ, ఆర్గానిక్ ఫుడ్, మెడికల్ నీడ్స్, ఫిట్ నెస్, మెడికల్ ఇన్సూరెన్స్ పై ఎక్కువ ఖర్చు చేస్తామన్నారు.

For More News..

కరోనా మీద కోపంతో నెట్లో ఏం వెతుకుతున్నారో తెలుసా..

అమెరికన్ల పాలిట కొత్త హీరో..

కరోనాను జయించిన 102 ఏళ్ల వృద్ధురాలు