ఎమ్మెల్యేను అడ్డుకున్న స్థానికులు

ఎమ్మెల్యేను అడ్డుకున్న స్థానికులు

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి చెక్కెదురైంది. స్థానిక కార్పొరేటర్ షేక్ అహ్మద్ తో కలిసి వడ్డెర బస్తీలో పర్యటిస్తున్న ఎమ్మెల్యేను స్థానికులు అడ్డుకున్నారు.  తమ బస్తీలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ నినాదాలు తీశారు. దాంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే గాంధీ.. ఆందోళనకారులను అరెస్ట్ చేయండంటూ అక్కడే ఉన్న పోలీసులకు హుకూం జారీ చేశాడు. వెంటనే పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

For More News..

తెలంగాణలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు

కౌలు చెల్లించలేక.. అప్పులు తీర్చలేక రైతు సూసైడ్