కొత్త టెక్నాలజీతో గుండె జబ్బులకు చెక్.. హోలిస్టిక్ లో ‘పల్స్ ఫీల్డ్ అబ్లేషన్’  ప్రారంభం 

కొత్త టెక్నాలజీతో గుండె జబ్బులకు చెక్.. హోలిస్టిక్ లో ‘పల్స్ ఫీల్డ్ అబ్లేషన్’  ప్రారంభం 

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లి నిజాంపేట రోడ్డులోని శ్రీశ్రీ హోలిస్టిక్​దవాఖానలో 'పల్స్​ ఫీల్డ్​ఆబ్లేషన్'​ అనే గుండె సంబంధిత నూతన టెక్నాలజీని మంగళవారం ప్రారంభించారు. దవాఖాన చైర్మన్​వి.ఎస్​.రామచంద్ర మాట్లాడుతూ గుండె కొట్టుకోవడంలో తేడాలున్న వారికి ఈ చికిత్సా విధానం మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. 

గుండె లోపలి విద్యుత్​ప్రవాహంలో హెచ్చుతగ్గుల కారణంగా బ్రెయిన్​స్ట్రోక్​,పెరాలసిస్​ వచ్చే ప్రమాదం ఉందని, నూతన టెక్నాలజీ ద్వారా వాటిని నివారించి గుండెతో పాటు రక్త కణాలకు గంటల వ్యవధిలోనే చికిత్స అందించగలమన్నారు. రాష్ట్రంలో తమ దవాఖానలోనే ఫస్ట్​టైం ఈ టెక్నాలజీని అమలు చేస్తున్నామన్నారు. డాక్టర్లు గోవింద్​, ప్రకాశ్​, భరణి పాల్గొన్నారు.