ఒలింపిక్స్‎ ఆటగాళ్లకు వండిపెట్టిన పంజాబ్ సీఎం

ఒలింపిక్స్‎ ఆటగాళ్లకు వండిపెట్టిన పంజాబ్ సీఎం

పంజాబ్: రోజూ రాజకీయాలతో బిజీగా ఉండే పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్... గరిటె పట్టారు. తానే స్వయంగా వంట చేసి అతిథులకు వడ్డించారు. టోక్యో ఒలింపిక్స్ పతకాలు గెలిచినవారితో పాటు... పంజాబ్ నుంచి ఒలింపిక్స్‎లో పాల్గొన్న ఆటగాళ్లకు నిన్న మొహాలీలోని తన ఫామ్ హౌస్‎లో ఆయన డిన్నర్ ఇచ్చారు. ఉదయం 11 గంటలకు వండడం మొదలు పెడితే... సాయంత్రం 5 గంటలకు పూర్తి చేశారు. మటన్ ఖాడా పిషోరీ, లౌంగ్ ఇలాచీ చికెన్, ఆలూ కుర్మా, దాల్ మస్రి, చికెన్ కుర్మా, దుగని బిర్యానీ, జర్దా రైస్ లాంటి పంజాబీ సంప్రదాయ వంటకాలను తయారు చేశారు. అతిథులందరికీ స్వయంగా ఆయనే వడ్డించారు.