పంజాబ్: రోజూ రాజకీయాలతో బిజీగా ఉండే పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్... గరిటె పట్టారు. తానే స్వయంగా వంట చేసి అతిథులకు వడ్డించారు. టోక్యో ఒలింపిక్స్ పతకాలు గెలిచినవారితో పాటు... పంజాబ్ నుంచి ఒలింపిక్స్లో పాల్గొన్న ఆటగాళ్లకు నిన్న మొహాలీలోని తన ఫామ్ హౌస్లో ఆయన డిన్నర్ ఇచ్చారు. ఉదయం 11 గంటలకు వండడం మొదలు పెడితే... సాయంత్రం 5 గంటలకు పూర్తి చేశారు. మటన్ ఖాడా పిషోరీ, లౌంగ్ ఇలాచీ చికెన్, ఆలూ కుర్మా, దాల్ మస్రి, చికెన్ కుర్మా, దుగని బిర్యానీ, జర్దా రైస్ లాంటి పంజాబీ సంప్రదాయ వంటకాలను తయారు చేశారు. అతిథులందరికీ స్వయంగా ఆయనే వడ్డించారు.
Privileged to have hosted our Olympians for dinner tonight. Thoroughly enjoyed cooking for them. May you continue to bring great laurels to the country. ?? pic.twitter.com/hI2ntXtZQs
— Capt.Amarinder Singh (@capt_amarinder) September 8, 2021