యువకుడిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే

యువకుడిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే
  • నియోజకవర్గానికి ఏం చేశావని అడిగిన వ్యక్తిని కొట్టిన ఎమ్మెల్యే

చండీగఢ్: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం సాధారణమే. ఓటు వేసి గెలింపించుకున్న నాయకులను.. అభివృద్ధి చేయకుంటే నిలదీయడమూ మామూలే. కానీ కొందరు నేతలు మాత్రం నన్నే ప్రశ్నిస్తావా, నిలదీస్తావా అంటూ బెదిరించిన సందర్భాలూ చూశాం. ఇలాంటి కోవలోకే వస్తుందీ ఘటన. నియోజకవర్గానికి ఏం చేశావని అడిగిన ఓ వ్యక్తిని పంజాబ్ ఎమ్మెల్యే జోగిందర్ పాల్ కొట్టడం హాట్ టాపిక్‌గా మారింది. 

పఠాన్‌కోట్‌లోని భోవాలో ఈ ఘటన వెలుగుజూసింది. గ్రామంలో తాను చేసిన అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే జోగిందర్ వివరిస్తుండగా.. ఓ యువకుడు ఆయన్ను ప్రశ్నించాడు. దీంతో పక్కనే ఉన్న పోలీసు అధికారి ఆ యువకుడ్ని పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ యువకుడు మాత్రం మీరేం ఏం చేశారో చెప్పాలంటూ జోగిందర్‌ను గట్టిగా అరుస్తూ క్వశ్చన్ చేశాడు. దీంతో జోగిందర్ అతడ్ని దగ్గరకు రమ్మని పిలిచారు. యువకుడి చేతికి మైక్ ఇచ్చి అతడ్ని కొట్టారు. జోగిందర్‌తోపాటు పోలీసులు, పలువురు అధికార పార్టీ నేతలు యువకుడిపై దాడికి దిగారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది. 

మరిన్ని వార్తల కోసం:

ఈటల గెలిస్తే ఏం మేలు జరుగుతుంది?

సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై కోర్టుకెళ్లిన సమంత

కార్మికుల్ని చంపిన తీవ్రవాదిని మట్టుబెట్టిన ఆర్మీ