కెనడాలో పంజాబ్ గ్యాంగ్ స్టర్ హత్య

కెనడాలో పంజాబ్ గ్యాంగ్ స్టర్ హత్య

మోగా జిల్లాలోని దవీందర్ బాంబిహా గ్యాంగ్‌కు చెందిన సుఖ్‌దూల్ సింగ్ అలియాస్ సుఖ్ దునేకే సెప్టెంబర్ 20న రాత్రి ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో హత్యకు గురైనట్లు కెనడా ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లు సూచిస్తున్నాయి. అతను కెనడాలోని విన్నిపెగ్‌లో హత్యకు గురైనట్లు సమాచారం. ఇది జూన్ 19న సర్రేలో జరిగిన అంతర్-గ్యాంగ్ వార్‌ఫేర్‌లో టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని చంపినట్లే చంపినట్టు ప్రాథమిక సమాచారం. అప్పట్లో ప్రత్యర్థులు నిజ్జర్‌ శరీరంలోకి 15 బుల్లెట్‌లను పంపారు.

2017లో నకిలీ పత్రాలపై దునెకే భారతదేశం నుంచి కెనడాకు పారిపోయాడు. ఈ క్రమంలో అతనిపై ఏడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌లలో దవీందర్ బాంబిహా గ్యాంగ్‌కు దునేకే సహాయం, నిధులు వంటి వాటిని బలోపేతం చేస్తున్నాడు. దునేకేకు పంజాబ్, సమీప రాష్ట్రాల్లోనూ మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో ఉన్న వ్యక్తులతో సంబంధాలున్నట్టు సమాచారం.

Also Read: 9ఏళ్లకు మోక్షం.. వారివన్నీ కపట మాటలు.. కేంద్రంపై ప్రియాంక చతుర్వేది ఫైర్

గతేడాది మార్చి 14న జలంధర్‌లోని మల్లియన్ గ్రామంలో జరిగిన కబడ్డీ మ్యాచ్‌లో కబడ్డీ క్రీడాకారుడు సందీప్ సింగ్ నంగల్‌ను తన సహచరుల సాయంతో హత్య చేసేందుకు దునెకే కుట్ర పన్నాడు. పంజాబ్, సమీప రాష్ట్రాల్లో అతనిపై హత్య, ఇతర క్రూరమైన నేరాలకు సంబంధించి 20కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.