బీఎస్ఎఫ్ కాల్పుల్లో పాక్ చొరబాటుదారుడు హతం

బీఎస్ఎఫ్ కాల్పుల్లో పాక్ చొరబాటుదారుడు హతం

చండీగఢ్‌: భారత సరిహద్దుల్లోకి వచ్చేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ కు చెందిన చొరబాటుదారుడు జవాన్ల చేతిలో హతమయ్యాడు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ సెక్టార్‌ భారత్‌, పాక్‌ బార్డర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం 6.45 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి అక్రమంగా సరిహద్దుల్లో చొరబడేందుకు ప్రయత్నించాడు. ముందస్తుగా హెచ్చరించినప్పటికీ వినకపోవడంతో బీఎస్ఎఫ్ ప్యాట్రోలింగ్ టీమ్ అతడిపై కాల్పులకు దిగింది. దీంతో చొరబాటుదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

కాగా, ఆదివారం సరిహద్దుల్లో డ్రోన్‌ సంచరించడంతో సైనికులు కాల్పులకు దిగారు. పొగమంచు కప్పివేసిన సమయంలో డ్రోన్‌ ఎగురుతూ కనిపించడంతో సైన్యం కాల్పులు జరిపిందని బీఎస్‌ఎఫ్‌ డీఐజీ ప్రభాకర్‌ జోషి పేర్కొన్నారు. సరిహద్దు వెంబడి డ్రోన్ లేదా ఇతర అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే బీఎస్‌ఎఫ్‌ పోస్ట్‌కు సమాచారం ఇవ్వాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తల కోసం: 

స్కూలు వాట్సాప్​ గ్రూపులో.. పోర్న్​ వీడియో

26 వేల బుల్లెట్‌‌ బండ్లలో బ్రేక్ సమస్య

కోటి మంది స్టూడెంట్లకు స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు, ట్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు