ముంబై: పంజాబ్ & మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పిఎంసి) బ్యాంక్ ఖాతాదారులు మంగళవారం బొంబాయి హైకోర్టు ఎదుట నిరసన తెలిపారు. కస్టమర్ల ప్రయోజనాలను కాపాడటానికి తీసుకోవలసిన చర్యలకు సంబంధించి ఆర్బీఐ ఈ రోజు అఫిడవిట్ దాఖలు చేసింది. తరువాత విచారణను డిసెంబర్ 4 వరకు వాయిదా వేసింది.
ఈ ఏడాది సెప్టెంబర్లో పీఎంసీ లో రూ .4,355 కోట్ల భారీ స్కామ్ జరిగినట్టు బయటపడింది. దీంతో ఖాతాదారులు తమ డబ్బు విత్ డ్రా చేసుకోకుండా ఆర్ బీ ఐ పరిమితులు విధించింది. ఈ కారణంగా తమ అవసరాలకు బ్యాంక్ నుంచి డబ్బు ఎలా తీసుకోవాలో తెలియక ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు.