ఇబ్రహీంపట్నంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ఓపెన్

ఇబ్రహీంపట్నంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ఓపెన్

హైదరాబాద్, వెలుగు : పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కొత్త శాఖను సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభించింది. కార్యక్రమానికి బ్యాంక్ హైదరాబాద్ జోనల్ మేనేజర్ దీపక్ కుమార్ శ్రీవాత్సవ, హైదరాబాద్ సర్కిల్ హెడ్ ఎన్ వీఎస్ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఓపెన్ చేసి మాట్లాడారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్  వివిధ రకాల రిటైల్ లోన్లను1.20 కోట్ల మందికి అందించిందని పేర్కొన్నారు. మార్కెట్ డిమాండ్ ను బట్టి ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు బ్యాంకు బ్రాంచ్ ను ప్రారంభించినట్టు తెలిపారు. కార్యక్రమంలో సిరి సంపద హోమ్స్ హెడ్ ఎ. వెంకటరెడ్డి, సిలికాన్ రిసార్ట్స్  సంస్థ హెడ్ వెంకటనరసయ్య, బ్యాంకు 
అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.