
హైదరాబాద్, వెలుగు: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, సీఈఓ అశోక్ చంద్ర హైదరాబాద్ జోన్లో బుధవారం పర్యటించారు. బేగంపేట్లో బ్యాంక్ నిర్వహించిన ప్రత్యేక ఎంఎస్ఎంఈ, స్వయం సహాయక బృందాల ఔట్రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించారని బ్యాంక్ తెలిపింది. స్వయం సహాయక బృందాలు, ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలకు సాయపడటానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. 300 ఎస్హెచ్సీ సభ్యులు, 200 మంది ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాంక్ రుణాల ద్వారా లబ్ది పొందిన వారితో ఎగ్జిబిషన్ కూడా నిర్వహించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్కు తెలంగాణలోని అన్ని 33 జిల్లా కేంద్రాల్లో, ప్రధాన నగరాల్లో 140కి పైగా శాఖలు ఉన్నాయి.