FANI బీభత్సం..పూరీలోనే 21 మంది మృతి

FANI బీభత్సం..పూరీలోనే 21 మంది మృతి

ఫొని తుఫాన్ బీభత్సానికి ఒడిశా అతలాకుతలమైంది. ఒక్క పూరీ జిల్లాలోనే 21 మంది మృతి చెందినట్లు ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు. వీరిలో గోడ కూలి 9 మంది చనిపోయారని చెప్పారు. భారీ వర్షాలకు తీర ప్రాంతాలు జలదిగ్బందంలో  చిక్కుకుపోయాయి. విద్యుత్ స్తంబాలు, చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టెలికాం సేవలు నిలిచిపోయాయి. తుఫాన్ ప్రభావంపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సమీక్ష నిర్వహించారు. తుఫాన్ బాధితులకు 15 రోజులు సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.