- లారీ కింద ప్రత్యేక అరలుపెట్టి తరలింపు
- రాయపర్తిలో 500 కిలోల మాల్పట్టివేత
- ఇద్దరు అరెస్ట్...పరారీలో మరో ఇద్దరు
రాయపర్తి, వెలుగు: వరంగల్జిల్లా రాయపర్తిలో సోమవారం పుష్ప సినిమా తరహాలో లారీల కింద ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి గంజాయి తరలిస్తూ దొరికిపోయారు. వెస్ట్ జోన్డీసీపీ సీతారాం కథనం ప్రకారం..రాయపర్తి పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారులో 20 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లు దొరికాయి. విశాఖపట్నం–నర్సీపట్నంకు చెందిన పోలిరెడ్డి గంగరాజు, తురాల నానాజీలను విచారించగా తమ వెనకాలే ట్రాలీ లారీ ఉందని అందులో గంజాయి ఉందని చెప్పారు. దీంతో ఆ లారీని ఆపగా డ్రైవర్, క్లీనర్లు అప్పికొండ శివ, అడప కిశోర్ కిందికి దూకి పారిపోయారు.
అయితే లారీలో చెక్ చేస్తే ఏమీ కనిపించలేదు. అనుమానం వచ్చి క్షుణ్ణంగా పరిశీలించగా, మధ్య భాగంలో ఏదో ఆల్ట్రేషన్చేసినట్టు అనిపించింది. లారీ వెనక భాగంలోని ఎలక్ట్రానిక్ షాకాబ్జర్స్ను పైకి లేపగా మధ్యలో 480 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. లారీ బాడీకి , కింది భాగంలో ఉన్న ప్లేస్లో ఐరన్తో అరలు చేయించి గంజాయిని పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నారు. తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ సమక్షంలో పంచనామ నిర్వహించి నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. వర్ధన్నపేట ఏసీపీ గొళ్ల రమేశ్, సీఐ సదన్ కుమార్, ఎస్సై బండారి రాజు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
జీతాలు రాక ప్రభుత్వ టీచర్ల అవస్థలు