రాష్ట్రంలో బస్ డిపో లు ఎక్కడా బంద్ చేయలేదన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ లేని విదంగా ఇక్కడ ఫిట్ మెంట్ ఇచ్చామని తెలిపారు. డబుల్ డెక్కర్ బస్ ల కోసం HMDA నుంచి 10 బస్ లు ఇప్పిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. మేడారం జాతర సమయంలో నష్టం వచ్చినా బస్సులు నడిపామన్నారు. కేవలం 11 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని ... అయినా అమ్మల దర్శనం కోసమే బస్ లను నడిపామని స్పష్టం చేశారు.డీజిల్ ధరలు భారీగా పెరిగినందునే మినీ బస్సులను నడపట్లేదని స్పష్టం చేశారు. మినీ బస్సుల్లో ప్యాసింజర్ కెపాసిటీ కూడా తక్కువగా ఉందన్నారు. ఈ క్రమంలో ప్రయాణికులకు వీలుగా ఉండేందుకు పెద్ద బస్సులను నడుపుతున్నామని తెలిపారు.
మరిన్ని వార్తల కోసం